నిజామాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్.. అడవుల్లో పచ్చదనం పెంచే ప్రయత్నం
నిజామాబాద్ జిల్లా హాసకొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. ఈ విత్తన బంతుల్లో చింత, వేప, అల్లనేరుడు, సీతాఫల, అశ్వంటి విత్తనాలు ఉంటాయి. వీరు బంక మట్టితో ఈ బంతులు తయారు చేసి ఎండబెట్టి, ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతాల్లో చల్లుతారు.
పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమానికి రోజూ ఒక గంట సమయం కేటాయించింది. ఇప్పటికే సుమారు 500 మట్టి బంతులను తయారు చేసి అడవుల్లో విసిరేశారు. ఈ విధానం వల్ల త్వరగా మొక్కలు మొలుస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలం సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బడి వర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెరగడంతో పాటు, అడవుల పచ్చదనం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com