భారత్లో ఎబోలా కేసులు లేవు — కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
భారత్లో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే WHO ఎబోలాను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాత్సవ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అన్ని స్థాయిల్లో పూర్తి సంసిద్ధతగా ఉండాలని, శాఖల మధ్య సమన్వయం పాటించాలని కార్యదర్శి సూచించారు. అనుమానిత కేసులను వెంటనే report చేయాలని నిర్దేశించారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు screening, quarantine నిబంధనలు, కేసుల నిర్వహణపై ప్రామాణిక కార్యచరణ విధానాన్ని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు పంపించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com