NEET పేపర్ లీక్పై హైదరాబాద్లో NSUI నిరసన, పోలీసులు అరెస్ట్
హైదరాబాద్లో NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) నేతలు NEET పేపర్ లీక్పై నిరసన చేపట్టారు. విద్యార్థి బచావో పేరుతో ట్యాంక్ బండ్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
NEET పేపర్ లీక్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, మధ్యలోనే పోలీసులు NSUI నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు NSUI కార్యకర్తలను అరెస్టు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com