ఒడిశాలో వరదలు: 1,300 ఇళ్లు ధ్వంసం, 8 లక్షల మంది ప్రభావితం
ఒడిశాలో వరదలు భారీ నష్టం కలిగించాయి. ఉత్తర ఒడిశాలో 1,300కు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రభావితమయ్యారు.
హీరాకుడ్ జలాసయం నుంచి 22 గేట్ల ద్వారా మహానదిలోకి భారీగా వరదనీరు విడుదల అవుతోంది. దీంతో మహానది డెల్టా ప్రాంతంలోని కటక్, పూరి, కుర్దా, జగత్సింగ్పూర్, కేంద్రపడ, అంగూల్, బౌద్, సంబల్పూర్, సబర్ణపూర్, నాయాగడ్ జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. సాలంది, బ్రాహ్మణి, బభైతరణి, జలగా, బుధబలంగ్ నదులు పొంగి ప్రవహించడంతో భద్రక్, జాజ్పూర్, బాలాసూర్, మయూర్ బంజ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది.
ఒడిశా ప్రభుత్వం మహానది పరివాహక ప్రాంతాల్లోని 10 జిల్లాలను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గత రెండు రోజులుగా వర్షాలు లేనందున ఉత్తర ఒడిశాలో వరద తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com