పెట్రోల్ ధరలపై పవన్ కల్యాణ్ స్పందన: ఇంధన పొదుపు అవసరమని విజ్ఞప్తి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెట్రోల్ ధర పెరుగుదలపై స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల పెట్రోలియం ఉత్పత్తులకు కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు ₹86కి చేరిందని చెప్పారు. ఒక్కప్పుడు ₹50కి ఐదు లీటర్లు వచ్చేవని, ఇప్పుడు ₹80కి ఒక్క లీటర్ కూడా రావడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల హర్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాలు మూసివేయబడితే ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఇప్పటికే డీజిల్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.
జనసేన పార్టీ తరపున రాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు పాటించాలని కోరారు. phone ద్వారా సాధ్యమయ్యే meetings కి వ్యక్తిగతంగా ప్రయాణించడం తగ్గించాలని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com