రోజ్గార్ మేళాలో PM మోదీ 51,000 మందికి నియామక పత్రాలు అందజేశారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజ్గార్ మేళా కార్యక్రమంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. రైల్వే, banking, రక్షణ, ఆరోగ్యం, విద్య సహా వివిధ రంగాల్లో ఈ నియామకాలు జరిగాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, తాను ఐదు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఆ పర్యటనలో పలు దేశాల పెద్ద కంపెనీల నేతలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ప్రపంచం భారత యువత పట్ల మరియు భారత సాంకేతిక పురోగతి పట్ల ఆసక్తి చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత యువతకు ఉపాధి అవకాశాలు, global exposure కల్పించేందుకు వివిధ దేశాలతో partnership చేసుకుంటున్నామని మోదీ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com