పూజా హెగ్డే 'జననాయగన్'తో తొమ్మిదో ఫ్లాప్; వరుస వైఫల్యాలతో కెరీర్పై ప్రభావం
నటి పూజా హెగ్డే తాజా చిత్రం 'జననాయగన్' ఫ్లాప్ కావడంతో, ఆమె వరుసగా తొమ్మిది ప్లాపులను నమోదు చేసుకుంది. 2021లో విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆమెకు చివరి విజయవంతమైన చిత్రం.
ఆ తర్వాత నటించిన 'బీస్ట్' (విజయ్), 'సర్కస్' (రణ్వీర్ సింగ్), 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (సల్మాన్ ఖాన్), 'దేవా', 'రెట్రో', 'హే జవానీ ఇష్కే హోనా హై' తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో చేసిన ఈ సినిమాలు ఏవీ విజయం సాధించలేదు.
వరుస ప్లాపుల కారణంగా పూజా రెమ్యునరేషన్ గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు సినిమాకు ₹3–3.5 కోట్లు డిమాండ్ చేసిన ఆమె, ప్రస్తుతం ₹1.5 కోట్లకే ఒప్పుకుంటున్నారు. 'గుంటూరు కారం' నుంచి షూటింగ్ మధ్యలోనే తప్పించగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' లో స్థానాన్ని కోల్పోయారు. కొన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు దూరమయ్యాయని వార్తలు వచ్చాయి.
అయితే, పూజా హెగ్డేకు కొత్త అవకాశాలు కూడా అందుతున్నాయి. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'శ్రీశ్రీ' చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారు. తమిళంలో 'కాంచన 4' లో నటిస్తున్నారు. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే రవితేజ, శ్రీ విష్ణు కలిసి నటించే చిత్రంలో అవకాశం వస్తుందని సమాచారం. వీటి ద్వారా ఆమె కెరీర్కు మలుపు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com