పూజా హెగ్డే ₹5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు
బాలీవుడ్, తమిళ్తోపాటు టాలీవుడ్లో నటిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకు దాదాపు ₹5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ పారితోషకం కారణంగా నిర్మాతలు ఆమెను సంప్రదించినా సినిమా అవకాశాలు వదులుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో టాలీవుడ్లో ఆమె చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ఈ నేపథ్యంలో అంత బడ్జెట్ పెట్టి ఆమెను తీసుకోవడం కంటే యువ హీరోయిన్లకు నిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. టాలీవుడ్లో కొత్త హీరోయిన్ల రాకతో పోటీ తీవ్రమైందని, దాంతో పూజా హెగ్డేకు అవకాశాలు తగ్గాయని అంటున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో విజయ్ 'జన నాయగన్', లారెన్స్ 'కాంచన 4' చిత్రాలతో పాటు దుల్కర్ సల్మాన్తో తెలుగు చిత్రం కూడా ఉంది. ఈ సినిమాలతో ఆమె మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com