మహారాష్ట్రలో భారీ వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరిగింది. కుమరం భీం జిల్లాలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తుమ్మడిహట్టి వద్ద వార్ధా, పెనుగంగ నదుల సంగమంతో ప్రాణహితలో నీటి మట్టం పెరిగింది. కౌటాల మండలంలోని పుష్కర ఘాట్ వరకు వరద నీరు చేరింది.
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండడంతో, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ నుండి భారీ వరద వస్తుండటంతో, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో ముంపు ముప్పు పొంచి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com