బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద మొసలికి పూజ చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఒక మొసలి నది నుంచి ఘాట్కు చేరుకుంది. ఆ మొసలి నేరుగా అక్కడి ఒక భవనంలోకి వెళ్లింది.
ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మొసలి ముందు కూర్చుని మంత్రోచ్ఛాటన చేస్తూ పూజలు నిర్వహించారు. కుంకుమ, పసుపు, పూలతో అభిషేకం చేశారు.
అనిల్ శర్మ ఈ మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com