నల్గొండలో ప్రైవేట్ బస్సులో మంటలు: 40 మంది ప్రయాణికులు సురక్షితం
నల్గొండ జిల్లా పెద్దకాపర్తి గ్రామ శివార్లలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటలకు ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
AC లో short circuit జరగడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రయాణికులు అందరూ నిద్రపోతున్నారు. డ్రైవర్ మరియు సహాయకుడు సమయానికి మంటలు గుర్తించారు. వారు వెంటనే బస్సు ఆపి ప్రయాణికులందరినీ, వారి సామానులను సురక్షితంగా బయటకు దించారు.
LB Nagar, Hayathnagar ప్రాంతాల్లో ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 10 రోజుల క్రితం కూడా చౌటుపల్ వద్ద మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com