వ్యాపారం

రూపాయి పతనం: సామాన్యులపై పెరిగే ధరల భారం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రూపాయి పతనం: సామాన్యులపై పెరిగే ధరల భారం
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

అమెరికన్ డాలర్‌తో పోల్చితే భారత రూపాయి విలువ వరుసగా పడిపోతోంది. ఒకప్పుడు ఒక డాలర్‌కు 60 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ విలువ 100 దిశగా వెళ్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

రూపాయి బలహీనపడడంతో దిగుమతుల భారం పెరుగుతోంది. భారత్ అధికంగా crude oil దిగుమతి చేసుకుంటుంది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందుల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు కూడా ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, యుద్ధ వాతావరణం, విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం — ఇవి రూపాయి పతనానికి ప్రధాన కారణాలని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.

డాలర్లలో తీసుకున్న విదేశీ అప్పులు చెల్లించడానికి ఎక్కువ రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, విదేశీ యాత్రలు చేసేవారికి ఖర్చులు గణనీయంగా పెరిగాయి.

రూపాయి విలువను స్థిరీకరించేందుకు Reserve Bank of India విదేశీ మారక నిల్వలను వినియోగిస్తూ మార్కెట్‌లో డాలర్ సరఫరాను నియంత్రిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు, దిగుమతుల నియంత్రణ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు పొదుపు పాటించాలని, బంగారం కొనుగోలు తగ్గించాలని, పెట్రోల్-డీజిల్ వినియోగం తగ్గించాలని పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడి, దేశీయ ఉత్పత్తి పెరిగి, విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తే రూపాయి కోలుకుంటుందని నిపుణులు అంటున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com