సాయి కృష్ణ లాక్ అప్ డెత్ కేసు: అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కోసం SIT గాలింపు
సాయి కృష్ణ లాక్ అప్ డెత్ కేసులో అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కోసం SIT అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ CI నాగరాజుకు సహకరించినట్లు SIT గుర్తించింది. కొన్ని రోజులుగా సెలవల్లో ఉన్న వారి ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తూ SIT అధికారులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సాయి కృష్ణ తల్లి CI నాగరాజుతో పాటు మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు SIT కు తెలిపారు. ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. SIT విచారణతో పాటు జుడిషియరీ విచారణ కూడా జరపాలని కుటుంబ సభ్యులు విజయవాడ రెండో అడిషనల్ మెట్రోపోలిటన్ కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని SIT అధికారులు పిటిషన్ వేశారు. కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com