చెట్ల తల్లి తిమ్మక్క: అవమానాల నుండి పద్మశ్రీ వరకు
కర్ణాటకకు చెందిన పర్యావరణ కార్యకర్త సాలుమరద తిమ్మక్కకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
తిమ్మక్క తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. చదువుకునే అవకాశం లేక చిన్నతనం నుండే కూలి పనులు చేశారు. అనంతరం హులికల్ గ్రామమానికి చెందిన చిక్కయ్యతో ఆమెకు వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. దీంతో సమాజం నుండి తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఆమె వందలాది చెట్లను పెంచి "వృక్షమాత"గా గుర్తింపు పొందారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com