జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించారు.
IT శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పుణ్యస్నానం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి కూడా పాల్గొన్నారు. పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com