మహేష్తో మరాఠీలో మాట్లాడిన శిల్పా షిరోద్కర్; నాడు జరిగిన సంఘటన షేర్
నటి శిల్పా షిరోద్కర్ మహేష్ బాబుతో జరిగిన ఫన్నీ సంఘటనను ఓ షోలో షేర్ చేశారు.
తన సిస్టర్ నమ్రతకు మహేష్తో పెళ్లైన కొత్తలో మరాఠీలో మాట్లాడేవారని శిల్పా గుర్తు చేసుకున్నారు. మహేష్కు మరాఠీ రాదని అనుకున్నామని, దాంతో ఫ్రీగా రహస్యాలు పంచుకునేవారని చెప్పారు.
మహేష్ కూడా అమాయకంగా ఏమీ అర్థం కానట్టు నటించేవారని శిల్పా తెలిపారు. ఓ రోజు మరాఠీలో మాట్లాడుతుండగా మహేష్ రియాక్ట్ అయ్యారని, అప్పుడు తనకు మరాఠీ అర్థమవుతుందని తెలిసిందని చెప్పారు.
తామెప్పుడూ మహేష్ గురించి తప్పుగా మాట్లాడలేదు కాబట్టి బయటపడ్డామని ఫన్నీగా ముగించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com