పుడిమడక తీరంలో సముద్రంలో చిక్కుకున్న సాయిల్ టెస్టింగ్ నిపుణులు; సురక్షితంగా ఒడ్డుకు
అనకాపల్లి జిల్లా పుడిమడక తీరంలో గురువారం నాడు నలుగురు సాయిల్ టెస్టింగ్ నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారు. సముద్రంలో ఉద్ధృత అలలకు వారు ప్రయాణిస్తున్న బార్జీ కొట్టుకుపోయింది. మెరైన్ పోలీసులు, స్థానిక మచ్చకారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి నలుగురినీ సురక్షితంగా తీరానికి చేర్చారు.
విశాఖపట్నం పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ బృందం అచ్యుతాపురం మండలం తంతడి సమీపంలో ప్రతిపాదిత జట్టీ నిర్మాణానికి సముద్ర అడుగున నేల సామర్థ్యం తెలుసుకోవడం కోసం సాయిల్ టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఇంజిన్ లేని బార్జీని మూడు బోట్లు లాగుతుండగా పెద్ద అలలకు తాళ్లు తెగిపోవడంతో బార్జీ నీటిలో కొట్టుకుపోయింది.
సమాచారం అందగానే పూడిమడక మెరైన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నేవీ, కోస్ట్ గార్డ్కు సమాచారం ఇచ్చినా సమయం తక్కువగా ఉండడంతో స్థానిక మచ్చకారులు, గజ ఈతగాళ్ల సాయంతో ప్రత్యేక పడవల్లో వెళ్లి చీకటి పడేలోపే నలుగురినీ బార్జీ నుంచి తమ పడవల్లోకి తరలించారు. నాలుగు గంటల శ్రమ తర్వాత వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేవు. అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com