అండమాన్కు చేరిన నైరుతి రుతుపవనాలు — మే 26కి కేరళలో అడుగుపెట్టే అవకాశం
నైరుతి రుతుపవనాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులను తాకాయి. ఈ ఏడాది సాధారణ తేదీ కంటే ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. IMD మే 26న కేరళలో రుతుపవనాలు అడుగుపెడతాయని అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగా వస్తాయని విశాఖ తుఫాన్ కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ అంచనాలో plus or minus నాలుగు రోజుల వ్యత్యాసం ఉండవచ్చని కూడా ఆయన వివరించారు.
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రుతుపవనాలు ప్రవేశించాయి. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో మరిన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ ఏడాది లాంగ్ పీరియడ్ యావరేజ్ కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ముందస్తు అంచనా ఉంది. అయితే రుతుపవనాలు set అయిన తర్వాత జూన్-జూలై కాలానికి subdivision వారీగా మరో అప్డేటెడ్ forecast విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో రాబోయే ఒక వారం పాటు ఒకటి రెండు చోట్ల thunder storm వచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణంలో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చే తేదీపై స్పష్టత ఇస్తామని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 5కి తెలుగు రాష్ట్రాలను, జూన్ 10కి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ను రుతుపవనాలు చేరుకుంటాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com