హైదరాబాద్లో 39 అడుగుల మట్టి గణేష్ విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కర్రపూజ
హైదరాబాద్లోని గడ్డి అన్నారం డివిజన్లోని పిఎన్టి కాలనీలో ఏర్పాటు చేసిన 39 అడుగుల మట్టి గణేశ విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కర్రపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి, ఆ మట్టిని ఇంటి పెరట్లో లేదా పూల కుండీలలో మొక్కలు పెంచేందుకు వినియోగించాలని సూచించారు.
శ్రీ గణేష్ భక్త యువ మండల్ ఆధ్వర్యంలో గత తొమ్మిదేళ్లుగా ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పర్యావరణ హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com