ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 45,000 మెడికల్ షాప్లు బందు
ఆన్లైన్ మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో 45,000కు పైగా మెడికల్ షాప్లు బందులో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్లు ఈ బందులో భాగస్వాములయ్యాయి.
హైదరాబాద్లోని కోటి ఇందిరాబాగ్ ఏరియా పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఈ ఏరియాలో సాధారణంగా హోల్సేల్, రీటేల్ మందుల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. SBI బ్యాంక్ నుంచి EMT హాస్పిటల్ వరకు, కోటి సుల్తాన్ బజార్ వరకు అన్ని మెడికల్ షాప్లు మూతపడ్డాయి.
అయితే Apollo Pharmacy, MedPlus వంటి కొన్ని corporate pharmacy లు మాత్రం తెరిచి ఉన్నాయి. ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలకు అటాచ్డ్గా ఉండే pharmacy లు కూడా తెరిచి ఉంచారు.
ప్రజలకు అత్యవసర మందులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ PHC లు, బస్తీ దవాఖానాలు, జిల్లా ఆస్పత్రులన్నిటినీ సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. Drug Control Authority కూడా ఒక నోటీసు విడుదల చేసింది.
ఆరోగ్య శాఖ మంత్రి నిన్న ఈ అంశంపై review meeting నిర్వహించారు. అత్యవసర సందర్భాల్లో మందులు అవసరమైతే సమీపంలోని షాప్ తెరిచేందుకు మెడికల్ షాప్ల అసోసియేషన్ Drug Control Office కి ఒక toll-free నంబర్ అందజేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com