తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం కొత్త అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది, పటాన్చెరు మండలాల్లో ఈ పథకం అమలు మొదలైంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా ఇవాళ విద్యార్థులకు అల్పాహారం అందించారు.
మెనూలో ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా, చట్నీ, సాంబార్ వంటివి ఉన్నాయి. ఈ పథకం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరుగుతుందని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com