తెలంగాణలో తీవ్ర వేడిమి: 7 జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41 నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు: ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ సహా మరో 17 జిల్లాలకు orange అలర్ట్ జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో 45.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మోస్రా, భీమగల్ మండలాల్లో వడగాలులు వీచాయి.
రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఈ సీజన్లో cumulonimbus మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బయటికి వెళ్లాల్సి వస్తే నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం తీసుకెళ్లాలని, వదులుగా ఉన్న దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com