తెలంగాణలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం — 336 కేంద్రాలు క్రియాశీలంగా
తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ యాసంగి సీజన్లో మొత్తం 43.18 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నలో 9.53 లక్షల మెట్రిక్ టన్నులు గోదాముల కు తరలించారు. మరో 2.01 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా తరలించాల్సి ఉంది.
జిల్లాల వారీగా చూస్తే, నాగర్కర్నూల్లో 1.55 లక్షల మెట్రిక్ టన్నులు, వరంగల్లో 1.1 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్లో 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఖమ్మం జిల్లా కొనుగోళ్లలో ముందంజులో ఉంది.
నిల్వ సౌకర్యాల విషయంలో మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అవసరం. ప్రస్తుతం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం మాత్రమే అందుబాటులో ఉంది. గన్నీ బ్యాగుల విషయంలో మొత్తం 3.10 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు 2.42 కోట్లు సరఫరా అయ్యాయి. మరో 67.84 లక్షల బ్యాగులు సర్దుబాటు చేయాల్సి ఉంది.
పలు జిల్లాల్లో రవాణా సమస్యల వల్ల కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com