ఆంధ్రప్రదేశ్

రైల్వే కోడూరులో గొలుసు ప్రమాదం: మూడు వాహనాలు అగ్నికి ఆహుతి, ముగ్గురికి గాయాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రైల్వే కోడూరులో గొలుసు ప్రమాదం: మూడు వాహనాలు అగ్నికి ఆహుతి, ముగ్గురికి గాయాలు
📷 Towfiqu barbhuiya / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద మూడు వాహనాలు ఒకదానికొకటి గుద్దుకొని అగ్నికి ఆహుతయ్యాయి. ముగ్గురికి గాయాలయ్యాయి.

ఒక లారీని ఇన్నోవా కారు వెనక నుంచి డీ కొట్టింది. ఆ వెంటనే మరో కారు ఇన్నోవాను ఢీ కొట్టింది. ఈ గొలుసు ప్రమాదంలో మూడు వాహనాలు కాలిపోయాయి.

గాయపడిన వారిని స్థానికులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com