రైల్వే కోడూరులో గొలుసు ప్రమాదం: మూడు వాహనాలు అగ్నికి ఆహుతి, ముగ్గురికి గాయాలు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద మూడు వాహనాలు ఒకదానికొకటి గుద్దుకొని అగ్నికి ఆహుతయ్యాయి. ముగ్గురికి గాయాలయ్యాయి.
ఒక లారీని ఇన్నోవా కారు వెనక నుంచి డీ కొట్టింది. ఆ వెంటనే మరో కారు ఇన్నోవాను ఢీ కొట్టింది. ఈ గొలుసు ప్రమాదంలో మూడు వాహనాలు కాలిపోయాయి.
గాయపడిన వారిని స్థానికులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com