సెప్టెంబర్ 15 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి 23 వరకు నిర్వహించనున్నట్లు TTD అధికారులు ప్రకటించారు.
గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో TTD అదనపు EO వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. JEOS డాక్టర్ ఎ. శరత్, CVSO మురళికృష్ణ, తిరుపతి జిల్లా SP సుబ్బ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని RTC బస్సుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచాలని వెంకయ్య చౌదరి సూచించారు. వాహనాల పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించాలని ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com