ఉప్పల్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు; MP ఈటల రాజేందర్ పాల్గొన్నారు
ఉప్పాల్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెల రోజుల సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ఘనంగా ముగిసింది.
ముగింపు కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పాల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈటల, ఇలాంటి శిక్షణ శిబిరాలు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీస్తాయని, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, జట్టుతత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com