తుంగభద్ర జలాలపై సమగ్ర నివేదికకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు.
ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీం లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ట్రిబ్యునల్ బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని మంత్రి తెలిపారు. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యం ఇవాలని ఆదేశించారు.
చట్టపరమైన, సాంకేతిక, పరిపాలన అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణలో 80వేల ఎకరాలకు తుంగభద్ర నీరు అందుతోంది. ఏపీలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలకు తుంగభద్ర జలాశయం కాలువల నీరు ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. ఈ జలాశయ రక్షణ కోసం ఇటీవల డ్యాముకు కొత్త గేట్లు ఏర్పాటు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com