మంచిర్యాలలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన మంత్రి వివేక్, బాధితులకు భరోసా
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నేడు సందర్శించారు.
ఇండ్ల ధ్వంసం, నష్టాలపై బాధిత కుటుంబాలతో మాట్లాడిన మంత్రి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్, MRO లకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ పర్యటనలో మంత్రి వివేక్, నష్టపరిహార వివరాలు సేకరించాలనీ, త్వరితగతిన రిపోర్ట్ అందించాలనీ అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com