దేశవ్యాప్తంగా తీవ్రమైన తాగునీటి కొరత — ఢిల్లీ, UP లో పరిస్థితి విషమం
దేశంలో పలు రాష్ట్రాల్లో వేసవి వేడిమి పెరగడంతో తాగునీటి కొరత తీవ్రంగా మారింది. వర్షాలు పడకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఊట బావులు, చెరువులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో రెండు నుండి మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు సరఫరా అవుతున్నాయి. అది కూడా అరకొరగానే వస్తోంది. దీంతో commercial water tanker లకు డిమాండ్ పెరిగింది. గృహాలు, కార్యాలయాలు, హోటల్స్ — అన్ని వర్గాలు నీటి కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో నీటి కష్టాలు ఎదుర్కుంటున్నారు. నల్లా కనెక్షన్లు ఉన్నా నీటి చుక్క రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు బిందెలు పట్టుకొని చెరువులు, బావుల దగ్గర క్యూ కడుతున్నారు. అక్కడ కూడా భూగర్భ జలాలు అడుగంటడంతో నిండుగా నింపుకోలేని పరిస్థితి నెలకొంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com