బెంగళూరులో ఏడాదిగా మూసి ఉన్న ఇంట్లో మహిళ అస్థిపంజరం
బెంగళూరులోని బాగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి మహిళ అస్థిపంజరం లభ్యమైంది. ఏడాదిగా మూసి ఉన్న ఆ ఇంటి బాత్రూంలో ఈ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు.
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాత్రూంలో ఎముకలను గుర్తించారు. మృతురాలి భర్త ఉమేశ్ గతంలో మరణించినట్లు, కొడుకు క్యాన్సర్తో చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.
పోలీసులు అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com