పెట్రోల్ ధరల పెంపుపై YSRCP నేడు నిరసనలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ YSRCP నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనుంది. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టనున్నారు.
పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో teleconference నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని అధికార పక్షం విస్మరించిందని ఆరోపించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని సజ్జల తెలిపారు. ఇది రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు AP లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసనల అనంతరం పార్టీ నేతలు జిల్లా కలెక్టర్లు, RDO లు, MRO లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటాయని YSRCP తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com