ఆదిలాబాద్: పారిశ్రామిక వాడ భూసేకరణపై రైతుల నిరసన, రూ.50 లక్షల పరిహారం డిమాండ్
ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టడంపై రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎకరాకు రూ. 50 లక్షల పరిహారం, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెన్గంగ నదిపై చనాక కోరట బ్యారేజీ సమీపంలో 10 వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికే 2060 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు.
బాధిత రైతులంతా కలెక్టర్ రాజర్షి షా వద్దకు వెళ్లి తమ డిమాండ్లను వివరించారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాల మేరకు పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏ రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com