అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీలకు ప్రత్యేక రైలు ప్రారంభం
అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీలకు ప్రత్యేక రైలు సోమవారం ప్రారంభమైంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో 20 భోగీలతో బయలుదేరిన ఈ రైలులో 1600 మంది భక్తులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
ప్రయాణికులకు ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. 100 మంది వాలంటీర్లు, వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు.
ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారమే ఈ యాత్ర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, అయోధ్యలో రామమందిరం, కాశీ విశ్వనాథ దేవాలయం దర్శించేలా ప్రణాళిక వేసినట్లు వివరించారు.
తొలి విడత అనంతరం మరిన్ని రైళ్లు నడిపే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com