ఆక్వా రైతులు రేపు కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో సమావేశం కానున్నారు
ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో చర్చలు కొనసాగిస్తున్నారు. రేపు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అచ్చన్నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ను కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచబోతున్నట్లు ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భగవాన్ రాజు తెలిపారు.
ఫిష్ మీల్ ఎగుమతులపై ఆంక్షలు విధించి, సోయా దిగుమతులపై పన్నులు తగ్గించాలని, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ చేపట్టాలని కోరుతున్నారు. ఆక్వా రంగంపై 18% జీఎస్టీని 5% కి తగ్గించాలని, అదే విధంగా ఆక్వాను వ్యవసాయంగా పరిగణించి జీఎస్టీలో సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం కారణంగా మేత ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రొయ్యల సాగు తగ్గిపోతే లక్షలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని భగవాన్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు కూడా వీరు వినతి పత్రం అందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com