నెల్లూరు బారాషాహీద్ దర్గాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
నెల్లూరులోని బారాషాహీద్ దర్గాలో ఐదు రోజుల రొట్టెల పండుగ మంగళవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్గాను సందర్శించారు. బాలా షహీద్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ ఐదు రోజుల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు కోరికల రొట్టెలు మార్చుకున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ నిర్వహించిన అధికారులను దర్గా కమిటీ సత్కరించింది.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బారాషాహీద్ దర్గా మత సామరస్యానికి ప్రతీక అన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొందరు రాజకీయ నాయకులు, దుర్మార్గులు మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తుండటం విచారకరమని ఆయన అన్నారు. ఇలాంటి పండుగలు సమాజంలో సామరస్యాన్ని పెంచుతాయని, ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com