బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాలపై కమిటీ ఏర్పాటు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలో భక్తుల విరాళాలలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. CM పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు సర్కార్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీకి ప్రభుత్వం విస్తృత అధికారాలను కల్పించింది. అవసరమైతే ఆర్థిక నిపుణులు మరియు ఇతర అధికారుల సహాయం తీసుకునేందుకు కమిటీకి అనుమతి ఇచ్చింది.
అక్రమాలపై దర్యాప్తు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విరాళాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన సంస్కరణాలను ఈ ప్యానెల్ సిఫారసు చేయనుంది.
ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక కీలక ఉద్యోగిని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ అయిన BKTC సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రమోద్ నోటియాల్ను BKTC తక్షణమే సస్పెండ్ చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com