శివకాశి అగ్గిపెట్టెల కథ: స్వీడిష్ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టిన అయ్యనాడార్
1920ల ప్రారంభంలో భారతదేశం అగ్గిపెట్టెలను పూర్తిగా దిగుమతి చేసుకునేది. స్వీడన్ కు చెందిన ఐవర్ క్రూగర్ అనే పారిశ్రామికవేత్త ప్రపంచ మార్కెట్ ను శాసించేవారు. ఐఎంసిఓ, విమకో వంటి విదేశీ సంస్థలు భారతీయ మార్కెట్ లో భారీ లాభాలు ఆర్జించేవి.
ఈ పరిస్థితిలో తమిళనాడు లోని శివకాశి గ్రామానికి చెందిన పి. అయ్యనాడార్ స్థానిక పరిశ్రమను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కోల్ కతా వెళ్లిన ఆయన అక్కడి అగ్గిపెట్టె కర్మాగారంలో సాధారణ కార్మికుడిగా చేరారు. రసాయన నిష్పత్తులు, చెక్క కటింగ్ టెక్నిక్స్ ను రహస్యంగా నేర్చుకున్నారు. ఆ వివరాలతో చేతితో రాసిన బ్లూప్రింట్ తో స్వగ్రామానికి తిరిగివచ్చారు.
అయ్యనాడార్ గ్రామస్తులకు చిన్న వర్క్ షాప్ లు ఏర్పాటు చేసి, చేతితో అగ్గిపుల్లలు తయారు చేయడం ప్రారంభించారు. విదేశీ బ్రాండ్ ల మార్కెటింగ్ ను తట్టుకోవడానికి ఆయన అగ్గిపెట్టెలపై స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ చిహ్నాలు, స్థానిక దేవతల బొమ్మలను ముద్రించారు. ఈ వ్యూహంతో అగ్గిపెట్టె కొనడం దేశభక్తిగా మారింది. విదేశీ అమ్మకాలు పడిపోయాయి.
ఈ చిన్న కుటీర పరిశ్రమ క్రమేపీ భారీ పరిశ్రమగా మారింది. ఆ తర్వాత శివకాశిలో బాణసంచా, ప్రింటింగ్, సేఫ్టీ మ్యాచ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగించే సేఫ్టీ మ్యాచ్ లు, బాణసంచాల్లో దాదాపు 90% శివకాశిలోనే తయారవుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com