పోలీసింగ్లో ఆధునిక సవాళ్లపై నేషనల్ సెమినార్లో బండారు దత్తాత్రేయ ప్రసంగం
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష్యం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ పోలీస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. పోలీసింగ్ వ్యవస్థ కొత్త రకమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. పోలీసులు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీలను వినియోగించుకోవాలని సూచించారు. 2024లో దేశంలో 1,01,038 సైబర్ నేర కేసులు నమోదైనట్లు, 2023తో పోలిస్తే ఇది 18% పెరిగిందని, వీటిలో 73% వరకు మోసం కేసులని వివరించారు.
దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. సెమినార్లో చర్చించిన అంశాలను సంక్షిప్తీకరించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఢిల్లీలో సమర్పిస్తామని తెలిపారు. లా అండ్ ఆర్డర్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి సమస్యలపై సేకరించిన అభిప్రాయాలను హోమ్ మినిస్టర్ కు నివేదికగా ఇవ్వడం వల్ల భవిష్యత్తు పాలసీ రూపకల్పనకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి సెమినార్ ను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా దేశంలో పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి కీలకమైన అభిప్రాయాలు సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com