36 సాగునీటి ప్రాజెక్టులకు గడువులు ప్రకటించిన CM చంద్రబాబు; వాతావరణ మార్పుపై ఆందోళన
CM చంద్రబాబు నాయుడు 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తి గడువులను ప్రకటించారు. KL రావు జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
మడకసర బ్రాంచ్ కెనాల్ 2027 డిసెంబర్ 31న, తారకరామ తీర్థ ప్రాజెక్టు 2027 డిసెంబర్ 30న పూర్తి చేస్తామన్నారు. వేదావతి, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గాలేరు నగరి, గోదావరి డెల్టా ఆధునీకరణ, వరికపూడి ప్రాజెక్టులు 2028 జూన్ 30 నాటికీ, ఎస్ఆర్ఎంసి అప్గ్రేడేషన్ 2028 డిసెంబర్ 31న, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు 2028 చివర్లో పూర్తవుతాయి.
88 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామని, మరో 35 వేల కోట్లు కేటాయిస్తామని CM తెలిపారు. ఈ ఏడాది పట్టిసీమ నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
వాతావరణ మార్పు అంశంపై కూడా ఆయన మాట్లాడారు. యూరప్లో 46 నుండి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో వాహనాల టైర్లు పగిలిపోతున్నాయని, రైల్వే లైన్లు కరిగిపోతున్నాయని వివరించారు. విజయవాడలో వేడిని తగ్గించేందుకు కలెక్టర్కు నీళ్లు చిలకరించాలని ఆదేశించానని, దీనివల్ల పరిస్థితి మెరుగైందన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com