కోనసీమలో గల్లంతైన జాలర్ల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు ముమ్మరం
కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు, దమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్ గార్డ్ సమన్వయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై మంత్రులు అనిత, వాసంశెట్టి సుభాష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలింపుకు అవసరమైన సాంకేతిక నౌకా సహాయం అందేలా సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. జాలర్ల ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగుతుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గాలింపు చర్యల్లో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com