ఆస్ట్రేలియా యురేనియం ఒప్పందం విషయంలో కాంగ్రెస్-బీజేపీ వివాదం
ఆస్ట్రేలియాతో యురేనియం ఒప్పందం కుదిరిన ఘనతను బీజేపీ ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో ఈ ఒప్పందం జరిగిందని సీనియర్ నేత జయరామ్ రమేష్ తెలిపారు.
అయితే 2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆస్ట్రేలియా నిరాకరించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఈ ఒప్పందం కుదిరిందని బీజేపీ నేత అమిత్ మాలవియ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయరామ్ రమేష్, 2011 డిసెంబర్లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్జడ్తో కాంగ్రెస్ హయాంలోనే ఒప్పందం జరిగిందని చెప్పారు. ఆ ఒప్పందాన్ని నిరూపించేందుకు 2011 నాటి మీడియా నివేదికల స్క్రీన్షాట్లను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఈ ఒప్పందం 2008లో చట్టంగా మారిన ఇండో-అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే సాధ్యమైందని జయరామ్ రమేష్ వివరించారు. నాడు ఆ ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ టర్నింగ్ పాయింట్లను సృష్టిస్తుందని, బీజేపీ మాత్రం యూటర్న్ పాయింట్లలో నిపుణులని విమర్శించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com