దశపాపహర దశమి: గంగాదేవి అర్ఘ్యం మంత్రం, విధానం
జ్యేష్ఠ మాస శుక్ల పక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఈ రోజు గంగా స్నానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పది రకాల పాపాలు తొలగిపోతాయని స్కాంద పురాణం చెబుతోంది.
నదీ స్నానం చేయలేనివారు ఇంట్లో స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి, 'మమ కాయక వాచక మానసిక ఇత్యాది దశవిధ పాపక్షయార్థం గంగా స్నానమహం కరిష్యే' అనే సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి.
ఆ తర్వాత పూజామందిరంలో పసుపు, కుంకుమ, ముగ్గు వేసిన చోట ఒక రాగిచెంబులో నీళ్లు పోసి, 'ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై...' అనే మంత్రంతో గంగాదేవిని ఆవాహన చేయాలి. ఆ నీటికి పూలు, అక్షింతలు కలిపి, 'నమస్తే గంగేదేవి నమస్తే విశ్వరూపిణి...' అనే శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వాలి. ఈ శ్లోక బలం వల్ల పది అశ్వమేధ యాగాల అవబృత స్నాన ఫలం లభిస్తుందని పురాణం తెలుపుతోంది.
ఈ రోజు నదీతీరంలో లేదా తులసికోట దగ్గర పది ఒత్తులు వెలిగించి, పది రకాల పూలతో ఇష్ట దైవాన్ని పూజించడం, పది నైవేద్యాలు సమర్పించడం, పది వస్తువులు దానం చేయడం వంటి ఆచరణలు కూడా పాపాల నుంచి విముక్తి కలిగిస్తాయని విశ్వాసం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com