బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సత్యసాయి సంజీవనికి ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ప్రకటన
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సత్యసాయి సంజీవని ఆసుపత్రికి తన ఒక సంవత్సరపు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజే చెక్ కూడా పంపిస్తానని ఆయన తెలిపారు.
పుట్టపర్తిలో ఉన్న ఈ ఆసుపత్రి పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తోంది. హరీశ్ రావు మాట్లాడుతూ, “సత్యసాయి సంజీవని కేవలం ఆసుపత్రి కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు ఇది దేవాలయం” అని అన్నారు.
చిన్నారులకు గుండెలో రంద్రాలు, ఇతర సమస్యలతో తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయని, ఈ ఆసుపత్రి ఆ పిల్లల్ని కాపాడడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా ధైర్యం ఇస్తుందని ఆయన వివరించారు. ఒక శస్త్రచికిత్స ద్వారా మూడు గుండెలను కాపాడినట్టేనని హరీశ్ రావు చెప్పారు.
ఈరోజు ఈ ఆసుపత్రిలో 500 శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఇది మెమరబుల్ డే అని హరీశ్ రావు ఈ సందర్భంగా తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com