ఈశాన్య రాష్ట్రాలు, ముంబైలో భారీ వర్షాలు; వరదలతో అపార నష్టం
అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు.
మహారాష్ట్ర లోని పూణే, ముంబై లలో కూడా భారీ వర్షం కురిసింది. ముంబైలోని కుర్లా, అంధేరి, మాటుంగా, మలాడ్ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. అంధేరి సబ్వే పూర్తిగా నీటిలో మునిగింది.
రోడ్లపై నీరు రావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్టు నివేదికలు వెల్లడించాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com