హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఐఆర్ఎఫ్సీ రుణం నిరాకరణ, ప్రత్యామ్నాయాలపై చర్చ
హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు కీలక సమావేశం తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన జరిగింది. మెట్రో ఫేస్-1 స్వాధీనానికి 15వే కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నిరాకరించిందని ఈ సమావేశంలో చర్చించారు.
దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కొత్త రుణాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే రుణాల సమీకరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.
మెట్రో, ఆర్టీసీ వంటి అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకే టికెట్ పై ప్రయాణించే విధానాన్ని అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉమ్మడి యాప్ అభివృద్ధికి టీజీఎస్ఆర్టీసీతో చర్చించాలన్నారు. ఆర్టీసీ లాగే మెట్రో ప్రయాణికులకు రోజువారీ, నెలవారీ పాసులు జారీ చేసే అవకాశాలను అన్వేషించాలని చెప్పారు.
మెట్రో రెండో దశ పనుల పురోగతిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కారిడార్లపై సమీక్షించారు. 40 కిలోమీటర్ల పాట్ టాక్సీ ప్రాజెక్ట్ టెండర్లపై చర్చించారు. అదనపు బోగీలను త్వరగా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.
ఫేస్-2 ప్రాజెక్ట్కు సంబంధించి ఎస్బీఐ క్యాప్స్ నివేదిక రావాల్సి ఉందని, ఆ నివేదిక తర్వాతే కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com