హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ భారీగా పెరుగుదల: రోజుకు 2.8 లక్షల వాహనాలు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ప్రతిరోజు 2.8 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రెండేళ్ల క్రితం పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపయింది.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ తీవ్రంగా ఉంటోంది. కోకాపేట్, నార్సింగి, నానక్రామగూడ, గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, కొల్లూరు, పఠాంచేరు ప్రాంతాల్లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 2,000 నుంచి 3,000 ఫ్లాట్లు ఉండగా, ప్రస్తుతం 30 శాతం మాత్రమే నిండాయి. మిగిలిన ఫ్లాట్లు రెండేళ్లలో నిండితే వేలాది కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐటీ కంపెనీలు గచ్చిబోలి, కోకాపేట్ ప్రాంతాల్లో విస్తరిస్తూ లక్షలాది మంది ఉద్యోగులు రోజూ ఒకే సమయంలో రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. కార్ పూలింగ్, షేరింగ్ పద్ధతులు ట్రాఫిక్ తగ్గించేందుకు ఉపయోగపడతాయని వాహనదారులు చెబుతున్నారు.
నార్సింగి ఇంటర్చేంజ్, కోకాపేట్ జంక్షన్, నానక్రామగూడ, గచ్చిబోలి జంక్షన్ల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ ఉన్నా పీక్ అవర్స్ లో భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఒక వాహనదారుడు మాట్లాడుతూ “ఇంతకుముందు 10 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 40-45 నిమిషాలు పడుతోంది” అని తెలిపారు. నానక్రామగూడ సర్కిల్ నుంచి గచ్చిబోలి వైపు ద్విచక్ర వాహనాలు, ఆటోలను అనుమతించడంతో ట్రాఫిక్ మరింత పెరిగిందని వాహనదారులు చెప్తున్నారు.
వాహనదారులు కొత్త ఇంటర్చేంజ్లు, అదనపు లైన్లు, సర్వీస్ రోడ్ల విస్తరణ, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com