తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక; 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతుపవనాలు రేపటిలోపు కేరళ, తమిళనాడును తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో ఈవోళ, రేపు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండవ వారంలో ప్రవేశించనున్నాయి. అయితే, నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ఈ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ రెండు రోజులూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com