కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్
కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు (ఆదివారం) వన్ వే ట్రాఫిక్ విధానాన్ని ట్రయల్ రన్ రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రయల్ రన్ ఉంటుంది. 150 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో నెల రోజుల క్రితం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిపిన ట్రయల్ రన్లో కొన్ని లోటుపాట్లు గుర్తించారు. వాటిని సరిదిద్ది మరోసారి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వన్ వే అమలు చేస్తారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్పాస్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం, GHMC సంయుక్తంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒకవైపు మార్గంలో మాత్రమే వాహనాలు నడవనున్నాయి. ఎడమ వైపు మార్గం నుంచి ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45, జూబ్లీ చెక్పోస్ట్ వైపు వెళ్లొచ్చు. కుడి వైపు మార్గం పూర్తిగా మూసేశారు. ట్రాఫిక్ సిగ్నల్ల సమయాన్ని సర్దుబాటు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్లే వీలుంది.
ప్రస్తుతం ఈ మార్గం గుండా ప్రయాణించడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ రోజు ట్రయల్ రన్ను పర్యవేక్షిస్తారు. లోపాలను సరిచేసి వారం రోజుల్లో పూర్తి స్థాయి వన్ వే అమలు చేస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com