పీవీ నుంచి నైతిక విలువలు నేర్చుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద పూర్వ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు.
నేటి రాజకీయాలు దిగజారిపోయాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం పీవీ సొంతం అని గుర్తు చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు.
రాజకీయాల్లో నైతిక విలువలు, పద్ధతులు పీవీ నరసింహారావును చూసి నేర్చుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరం కలిసి ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com