కృష్ణా జిల్లా మహిళ పత్రికల్లోని ముఖ్యమైన అంశాలను సేకరించి పుస్తకాలుగా మారుస్తున్నారు
కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ధనేకుల మణికుమారి దినపత్రికలు, మ్యాగజైన్లలో వచ్చిన ముఖ్యమైన అంశాలను సేకరిస్తున్నారు.
ఆమె ఇంటర్ వరకు చదువుకున్నారు. టైపిస్ట్, స్టెనోగా పలు చోట్ల పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కుమారులు నిర్వహించే పెట్రోల్ బంక్ వ్యాపారాల్లో సాయం చేస్తున్నారు.
ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో వివిధ శీర్షికల కింద వచ్చిన అంశాలను ఆమె ఫైళ్లలో భద్రపరుస్తున్నారు. కొన్నింటిని పుస్తకాలుగా రూపొందిస్తున్నారు. వాటి జిరాక్స్ ప్రతులను పాఠశాల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా ఉన్న కార్యక్రమాల్లో కూడా వాటిని ప్రదర్శిస్తున్నారు.
2014 నుంచి ఇప్పటివరకు వేలాది అంశాలను సేకరించినట్టు మణికుమారి తెలిపారు. అవసరమైనప్పుడు తీసుకునేలా వీలుగా వాటిని ఫోల్డర్లు, బాక్స్ ఫైళ్లలో విడివిడిగా అమర్చుకున్నారు.
విద్యార్థులు, యువత సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న తరుణంలో నీతి వాక్యాలతో కూడిన పుస్తకాలను అందించడమే లక్ష్యమని ఆమె చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com